Listen to this article

-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్

జనం న్యూస్ ఫిబ్రవరి 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వె్ల్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, రాష్ట్ర కౌన్సిలర్ రాజులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పెండింగ్ బిల్లుల పై ఎటివో గజ్వేల్ కార్యాలయాన్ని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల నాగరాజు, గోక విద్యా సాగర్ తో కలిసి సందర్శించారు,ఈ సందర్బంగా మాట్లాడుతూపెండింగులో ఉన్న మెడికల్, జిపిఎఫ్ లోన్స్, పార్ట్ ఫైనల్స్, ఫైనల్ పేమెంట్, సరెండర్,ఇతర బకాయిలువెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష రూపాయలుపై బడిన బిల్లులు విడుదల చేయకపోవడం, వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, వెంటనే ఆయా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం డైరీని ఎటివో మరియు ఎస్టివో కు అందజేశారు.