Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 27,అచ్యుతాపురం:

ఉద్యోగుల భద్రత మరియు శ్రేయస్సులో భాగంగా అచ్యుతాపురం పోలీస్ విభాగం సహకారంతో మహిళలపై నేరాలపై అవగాహన కార్యక్రమంను బ్రాండిక్స్ యూనిట్ 1లో 1229 మంది మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక సీఐ చంద్రశేఖర్ రావు, ఎస్‌ఐ కె. సుధాకర్ రావు, జిల్లా వన్-స్టాప్ సెంటర్ నుండి కోఆర్డినేటర్ మంజులవాణి,జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ బృందం కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల భద్రత, చట్టపరమైన హక్కులు మరియు నివారణ చర్యలపై విలువైన అవగాహనను పంచుకోవడం జరిగిందని, అలాగే ప్రమాదకర పరిస్థితులను గుర్తించడం, అవసరమైనప్పుడు సహాయం పొందడం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు మరియు స్వీయ రక్షణపై అవగాహన కల్పించామని అన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, అవగాహనను విస్తరించడం మరియు సురక్షితమైన కార్యాలయ వాతావరణాన్ని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు మరియు కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.