

జనం న్యూస్ 15; ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ 38వ జాతీయ క్రీడా పోటీలలో భాగంగా ఫిబ్రవరి 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో జరిగిన 4*100 రిలే అథ్లెటిక్ విభాగంలో జిల్లాకు చెందిన మాలోతు సింధు కాంస్య పతకం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్ లో ఘనంగా సన్మానించారు. ఈ దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారుల్లో ఇమిడి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వెలికితీయాలని అన్నారు. జాతీయస్థాయిలో జిల్లా క్రీడలకు గుర్తింపు తెచ్చిన ఇందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసి 25000/- చెక్కును అందజేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించిన మాలోత్ సింధు కోచ్ నరేష్ మరియు తండ్రి మాలోతు లక్ష్మణ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి ఎం పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్, డిస్టిక్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, న్యూ స్టార్ క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్ ప్లేయర్ ఎండి బాబ్జి మరియు కార్యాలయ సిబ్బంది తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.