

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్, మార్టూరు రోడ్డు,అచ్యుతాపురం సెంటర్,సాయి ప్రియా లే అవుట్ ప్రాంతాల్లో అలాగే రామన్నపాలెం ఫీడర్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా అవ సోమవారం,అవరాజాం,చీమలాపల్లి,అప్పన్నపాలెం,బంగారయ్యపాలెం,జేపీ అగ్రహారం,నారపాక,ఎరకన్నపాలెం,తట్టవానిపాలెం,రామన్నపాలెం,ఇరువాడ, చిట్టిబోయినపాలెం,దొప్పర్ల, నడింపల్లి గ్రామాలకు 21వ తేదీ అనగా శనివారం ఉదయం10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగ దారులు సహకరించాలని కోరారు.