

జనం న్యూస్ //ఫిబ్రవరి //21// జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఏడాదిలో 55,000 వేల పైచిలుకు ఉద్యోగాలు నిరుద్యోగులకు అందజేశం.భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే.- పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.కో-ఆర్డినేటర్ రివ్యూ సమీక్షసమావేశంలో రేవూరి,వొడితల. పదేళ్లు కేంద్ర,రాష్ట్ర లో అధికారంలో ఉన్న ,బిజెపి,బి.ఆర్.ఏస్. పార్టీలు నిరుద్యోగుల విషయంలో అన్యాయం చేశారని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కో-ఆర్డినేటర్స్ సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సమీక్ష సమావేశానికి జమ్మికుంట పట్టణ,వీణవంక మండల కో-ఆర్డినేటర్స్ హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా పనిచేసి,పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.అలాగే పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఒక్క ఓటు కూడా తప్పకుండా ఓటు వేసేవరికి బాధ్యత తీసుకోవాలని కోరారు.పట్టభద్రుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని త్వరలోనే వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చొరవ చూపిస్తుందని అన్నారు.గడచిన ఏడాదిలో దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం 55,000 వేల ఉద్యోగాలు,ఇచ్చిందని,నియామకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
