Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 25 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మల్కాపూర్ హనుమాన్ గుడి నుండి శివ స్వాములు మంగళవారం నాడు సంజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి తోని శివ స్వాములు శ్రీశైలం మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి దర్శనం, ఇరుముడి సమర్పించడానికి బయలుదేరి వెళ్ళినారు. శివ స్వాములు శివరాత్రి వరకు 41 రోజులు శివ స్వాముల దీక్ష అనంతరం శివరాత్రి రోజున శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో ఇరుముడి సమర్పించి దీక్ష విరమణ చేస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. మల్కాపూర్ హనుమాన్ గుడి వద్ద శివ స్వాములకు మరియు భక్తులకు మహా అన్న ప్రసాదం ఏర్పాటు చేసినారు. శివ స్వాములు అన్నప్రసాద తీసుకొని అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో అశోక్ స్వామి గణేష్ స్వామి మరియు భక్తులు కృష్ణారెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు