

జనం న్యూస్ మార్చ్1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగు తున్న 15శాతం ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతా నికి చెందిన స్టూడెంట్లు, ఇతర ప్రాంతాల్లో చదివిన కి కేటాయించనుంది. దీనికి సంబంధించిన జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేశారు.రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మా-డీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తది తర కోర్సుల్లో 85శాతం స్థానిక తెలంగాణ స్టూడెం ట్లకు, 15శాతం ఓపెన్ కేటగిరి సీట్లలో తెలంగాణ తోపాటు ఏపీ స్టూడెంట్స్ పోటీపడే అవకాశం ఉంది. అయితే, ఏపీ, తెలంగాణ విభజన జరిగి పందేళ్లు పూర్తయిన నేపథ్యంలో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికింది. స్థానికత, అడ్మిషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ పలు కోర్సుల్లో అడ్మిషన్లలో స్థానికత అంశంపై పలు రకాల సిఫార్సులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కమిటీ సూచనలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 85శాతం సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే అలాట్ చేయనుంది. స్థానికత, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ఆ సీట్ల అలాట్ ఉంటుంది.15శాతం సీట్లను తెలంగాణ స్థానికత ఉండి, ఇతర రాష్ట్రాల్లో చదువుకునేవా రితో భర్తీ చేయనుంది. అయితే, తెలంగాణలో పందేళ్ల పాటు నివాస ముండాలనే షరతును ప్రభుత్వం పెట్టింది. ప్రభు త్వం తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న కి ఉపయోగపడే అవకాశం ఉంది. దీనికితోడు చదువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే కి ఉపయోగపడ నుంది.