Listen to this article

జనం న్యూస్ మార్చ్, 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) రీసర్వేలో కూడా పాల్గొనని కేసీఆర్‌ ఫ్యామిలీ తెలంగాణ సర్కారుకు కేసీఆర్‌ ఫ్యామిలీ మరోసారి షాకిచ్చింది. కుల గణనలో పాల్గొనని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16 నుండి 28 వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈరోజుతో రెండో దఫా కులగణన సర్వే ముగిసింది. ఈ 12 రోజుల్లో కేవలం 15 వేల కుటుంబాలే సర్వేలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే రీసర్వేలో కూడా కేసీఆర్‌ కుటుంబం పాల్గొనలేదని వారు తెలిపారు.