Listen to this article

పెద్దపెల్లి జిల్లా మంతిని ఆర్సి జనం న్యూస్.ప్రతినిధి వెంకటేష్ జనవరి 11 న్యూస్

*ప్రైవేట్ కుదిరిటిగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు

*పెద్దపల్లి ఎం.సి.హెచ్ ఆసుపత్రిలో డీఈఐసి సెంటర్ ఏర్పాటు

*త్వరలో మరోసారి దివ్యాంగులు గుర్తింపు క్యాంపు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తాం

*పెద్దపల్లిలో ఎంపిక కాబడిన దివ్యాంగులకు ఉపకరణాలను స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
——————————
రామగుండం లో11 వ తారీకు నిర్వహించారు
——————————
దివ్యాంగుల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సంపూర్ణ సహకారం అందజేస్తామని *ఎమ్మెల్యే మక్కా.సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.

శనివారం రామగుండంలో క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంల లో స్థానిక ఎమ్మెల్యే మఖన్. సింగ్ తో కలిసి అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు 27 లక్షల విలువ గల ఉపకరణాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత నవంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా క్యాంప్ నిర్వహించి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన దివ్యాంగులను ఎంపిక చేసామని , ఎంపిక కాబడిన దివ్యాంగులకు నేడు 27 లక్షల విలువ చేసే వివిధ ఉపకారణాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే 2 నెలల వ్యవధిలో మరొకసారి క్యాంపు నిర్వహించి ఇంకా ఎవరైనా దివ్యాంగులు పెండింగ్లో ఉంటే వారిని గుర్తించి అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రతి పాఠశాలను ఆర్.బి.ఎస్.కే బృందాలు పర్యటిస్తూ పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారని, ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందించడం జరుగుతుందని కలెక్టర్ . చిన్నపిల్లల ఎదుగుదల సమస్యలను గుర్తించేందుకు మన పెద్దపల్లి జిల్లా మాత శిశు ఆసుపత్రిలో డి.ఈ.ఐ.సి సెంటర్ ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

జిల్లాలో వినికిడి సమస్య ఉన్న పిల్లలను గుర్తించామని వారికి త్వరలోనే ఉచితంగా వినికిడి యంత్రాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. దివ్యాంగుల జీవనోపాధి కోసం వ్యాపార యూనిట్ల స్థాపనకు రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిఎండబ్ల్యూఓ. వేణుగోపాల్ తెలిపారు

కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మేయర్ అనిల్ కుమార్ , దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించేందుకు నవంబర్ నెలలో అలింకో సంస్థ ద్వారా ప్రత్యేక నిర్ధారణ క్యాంపు నిర్వహించామని, మన పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 190 మంది దివ్యాంగులను ఎంపిక చేసామని, వారికి నేడు అవసరమైన పరికరాలను అందించడం సంతోషంగా ఉందని అన్నారు.

భవిష్యత్తులో మరొక మారు నిర్ధారణ క్యాంపు నిర్వహించి మిగిలిన దివ్యాంగులకు కూడా ఉపకరణాలు అందించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. మన ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని, గతంలో కంటే ఔట్ పేషెంట్ సంఖ్య, ప్రసవాల సంఖ్య, వివిధ శస్యతల సంఖ్య పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గణనీయంగా పెరిగిందని, దీనికి కృషి చేసిన కలెక్టర్ కు, సంబంధిత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో పెద్దపెల్లి జిల్లా ఆసుపత్రిని వంద పడకలకు విస్తరిస్తున్నామని, నెలాఖరు నాటికి టెండర్ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని
ఎమ్మెల్యే తెలిపారు.

పేద ప్రజలు ఆసుపత్రులలో డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రస్తుతం మన ప్రభుత్వాసుపత్రులలో అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని వీటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల రావు, ఎఫ్ ఆర్ వో స్వర్ణలత. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.